NATIONAL STUDENT PARYAVARAN COMPETITION 2025 NSPC


*నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ ( NSPSC)-2025 వివరాలు*

** వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షణ కోసం విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం అత్యంత అవసరం, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాల వేరుచేయడం వంటి పద్ధతులు ప్రతి విద్యార్థికి అలవాటగుటకు ఈ పోటీని నిర్వహిస్తున్నారు.

ఈ పోటీలు
*Harith the Way of Life* అనే నినాదం తో పర్యావరణ సంరక్షణ
ఉద్దేశంగా దేశవ్యాప్తంగా జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్లు (పోటీలు) అందుబాటులో ఉంటాయి.కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఫలితాలు ఆగస్టు 30న విడుదల విడుదల చేస్తారు.

*పోటీ ఐదు విభాగాలలో జరుగుతున్నది*..

1) 1వ తరగతి నుండి 5వ తరగతి, 
2) 6వ తరగతి నుండి            8వ తరగతి, 
3) 9వ తరగతి నుండి 12వ తరగతి, 
4) డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, 
5) ఇతరులు, సాధారణ పౌరులు పోటీ ల పాల్గొనవచ్చు,
 పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  

ఎకో మిత్రం  https://ecomitram.app/nspc/
అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
హిందీ, ఇంగ్లీష్ సహా అనేక భాషలలో క్విజ్ అందుబాటులో ఉంటాయి .
 *మొక్క నాటుతున్న , నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న మీసెల్ఫీని అప్లోడ్ చేయడం తప్పనిసరిగా* ఉండాలి.
26 జూన్ న జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ గారు ,జిల్లా విద్యాధికారి శ్రీ కె రాము గారు Poster విడుదల చేసి ప్రతి విద్యార్థికి పాల్గొన్నందుకు ఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని, ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్ లు చొరవ తీసుకొని అందరు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనేల ప్రోత్సహించాలని తెలిపారు ,వివరాలకు జగిత్యాల జిల్లా జాతీయ హరితదళం కోఆర్డినేటర్ మచ్చ రాజశేఖర్ 9440212333 లో సంప్రదించగలరు.